Sunday, April 28, 2024

మేడ్చల్ కలెక్టరేట్ వద్ద బీజేవైఎం ధర్నా… అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రభ న్యూస్, ప్రతినిధి, మేడ్చల్, ఆగస్ట్ 11: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట బి.జే.వై.ఎం ధర్నా నిర్వహించింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనీ నినాదాలు చేస్తూ బీజేవైఎం నాయకులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ ను తరిమికొడితే తప్ప నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, బి.జే.వై.ఎం రాష్ట్ర అధ్యక్షులు బాను ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement