Tuesday, April 30, 2024

TS : నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అంటూ ప్రజలను రెచ్చగొట్టింది మీరే…

షాద్ నగర్, మార్చి 6 (ప్రభ న్యూస్) హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని బీఆర్ఎస్ నేత, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ‌వారం షాద్ నగర్ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని అన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైందని తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు.

- Advertisement -

నో ఎల్.ఆర్.ఎస్ – నో బీ.ఆర్.ఎస్ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్.ఆర్.ఎస్ కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనం అని అన్నారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతం లో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్.ఆర్.ఎస్ ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement