Thursday, May 2, 2024

RR: హరితహారంలో మొక్కలు నాటిన ఎంపీపీ చంద్రకళ

వికారాబాద్, ఆగస్టు 4 (ప్రభ న్యూస్): హరితహారంలో భాగంగా ఎంపీపీ చంద్రకళ మొక్కలు నాటారు. అలాగే రోడ్డు కిరువైపులా చెట్లను నాటే ఎవెన్యూ ప్లాంటేషన్ పాతూరు నుంచి సిద్దులూరు రోడ్డులో ఉన్న మొక్కలను ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సత్తయ్య పరిశీలించడం జరిగింది.

ప్రతి మొక్కను జాగ్రత్తగా పెంచాలి, ప్రతి మొక్కకు పాదుచేయాలి, చుట్టూ గడ్డి తొలగించాలన్నారు. ఏపుగా పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని అక్కడక్కడ ఉన్న గ్యాప్ లో కొత్త మొక్కలను నాటాలని ఎంపీపీ సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సిద్దులూరు గౌస్ద్దీన్, ఏపీవో శ్రీనివాస్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ నవీన్ పంచాయతీ కార్యదర్శి సుప్రియ, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement