Sunday, April 28, 2024

జులైలో 23 ల‌క్ష‌ల మంది భక్తుల‌కు స్వామి ద‌ర్శ‌న భాగ్యం – రూ. 129 కోట్ల హుండీ ఆదాయం

తిరుమల శ్రీవారి ఆదాయం ఈ గణనీయంగా పెరుగుతున్న‌ది. క‌రోనా స‌మ‌యం ఆటు ఆదాయం, ఇటు భ‌క్తులు లేక వెల‌వెల‌బోయిన వ‌డ్డీకాసులు వాడు ఇప్పుడు కాసుల మోత‌తో,భ‌క్తుల రాక‌తో గ‌ల‌గ‌ల‌లాడుతున్నాడు.. గతంలో పోల్చితే స్వామివారికి హుండీ ద్వారా అధిక ఆదాయం లభిస్తోంది. తాజాగా జులై నెలలో తిరుమల శ్రీనివాసుడికి హుండీ ద్వారా రూ.129.08 కోట్ల ఆదాయం లభించింది. గత నెలలో వెంకన్నస్వామిని 23.23 లక్షల మంది దర్శించుకున్నారు. అదే సమయంలో 1.10 కోట్ల లడ్డూలను విక్రయించారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

56.68 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని, జులై నెలకు సంబంధించి తలనీలాల విక్రయం ద్వారా రూ.104 కోట్లు వచ్చిందనీ వివరించారు. అలాగే విశేష పూజ‌లు, ఇత‌ర‌త్ర వాటి ద్వారా మ‌రో 32 కోట్ల రూపాయిలు స్వామి వారి స‌న్నిధికి చేరింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement