Saturday, April 27, 2024

Exclusive | భారత అమ్ములపొదిలో అధునాతన అస్త్రం.. పర్వతాల వెనక దాగి ఉన్న శత్రువులే టార్గెట్​!

భారత ఎయిర్​ఫోర్స్​ అమ్ముల పొదిలో మరో అధునాతన అస్త్రం చేరింది. పర్వతాల వెనకాల దాగి ఉన్న శత్రు మూకలను సైతం టార్గెట్​ చేసి ధ్వంసం చేయగల క్షిపణులను ఇజ్రాయెల్​ నుంచి ఇండియా కొనుగోలు చేసింది. దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్​ కూడా ఈ క్షిపణుల ద్వారా ఈజీగా దెబ్బతీయొచ్చు. ఇప్పుడు ఈ యాంటీ ట్యాంక్​ గైడెడ్​ మిస్సైల్స్​ ట్రయల్స్​ని జరుగుతున్నాయి.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఇజ్రాయెల్ కి చెందిన స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్ (NLOS) యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను భారత్​ కొనుగోలు చేసింది. వీటిని కొనుగోలు చేయడం ద్వారా పర్వతాల వెనుక ఉన్న రహస్య శత్రు శిబిరాలను కూఆ ధ్వంసం చేయడానికి భారత వైమానిక దళం (IAF) తన సామర్థ్యాలను మెరుగుపర్చుకుంది. ఈ అధునాతన క్షిపణి 30 కి.మీల పరిధిలోని టార్గెట్​ని ఈజీగా కూల్చివేస్తుంది. సుదూర లక్ష్యాలను కచ్చితంగా ఛేదించడానికి వీలు కల్పిస్తుందని ఎయిర్​ఫోర్స్​ అధికారులు చెబుతున్నారు.

కాగా, ఇజ్రాయెలీ స్పైక్ క్షిపణుల డెలివరీ ఇప్పటికే పర్తయ్యిందని, IAF ఇప్పుడు వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి ట్రయల్స్ నిర్వహించనున్నట్టు సమాచారం అందుతోంది.  కాగా, భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఈ క్షిపణుల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఈ క్షిపణులను Mi-17తో సహా IAF కు చెందిన హెలికాప్టర్‌లలో, భారతదేశం తయారు చేసిన ‘ప్రచండ్​’ హెలికాప్టర్‌లలో ఉపయోగించనున్నారు. భారత సైన్యం త్వరలో ఈ క్షిపణుల ట్రయల్‌ని నిర్వహించనున్నట్టు ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి.

స్పైక్ NLOS క్షిపణుల లక్షణాలు

- Advertisement -

పరిధి: 32-కి.మీ

బరువు: 70-కిలోలు

వేదిక: హెలికాప్టర్

అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి ఇట్లాంటి క్షిపణిని కొనుగోలు చేశాయి. ఈ క్షిపణులను ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఆర్మేనియా యుద్ధ ప్రాంతాల్లో ఉపయోగించినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement