Thursday, May 16, 2024

పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే యాదయ్య శంకుస్థాపన

వికారాబాద్, జులై 10 (ప్రభ న్యూస్): నవాబ్ పేట మండలం మెహతాబ్కాన్ కూడా గ్రామ పంచాయతీకి కేటాయించిన రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య శంకుస్థాపన చేశారు. ఇవాళ ఉదయం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిత రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఆర్గతుల రామిరెడ్డి, నాయకులు రంగారెడ్డి పంచాయతీ మాధవరెడ్డి, ఏఈ లక్ష్మయ్య, వివిధ గ్రామాల సర్పంచులతో కలిసి ఆయన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కాల యాదయ్య మాట్లాడుతూ… 50 రోజుల్లో ప్రతి గ్రామపంచాయతీ భవనానికి సొంత భవనం నిర్మిస్తామని, ఇది కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీకి భవనాన్ని నిర్మిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కరణం రఘు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement