ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలో పల్లె దవాఖానాను రాష్ట కార్మిక శాఖ మంత్రి మలారెడ్డి ప్రారంభించారు. రూ.16లక్షలతో చేపడుతున్న నూతన పల్లె దావాఖాన భవనం శంకుస్థాపన చేశారు. అలాగే రూ.10లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను శంకుస్థాపన చేయడం జరిగింది. ఈసందర్భంగా మంత్రి మెడికల్ చెకప్ లు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, మండలం పార్టీ అధ్యక్షులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital