Friday, May 10, 2024

ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన వస్తువులు

కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంగన్ వాడి, హాస్టళ్లలకు, స్కూళ్లలకు ప్రభుత్వం తరుపున సరఫరా చేసే గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గుడ్లు, టన్నుల జొన్న పిండి, పాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement