Saturday, May 18, 2024

Breaking: లోయలో పడ్డ బ‌స్సు : 14 మంది మృతి

ఓ బ‌స్సు లోయ‌లో ప‌డి 14మంది మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. చంపావత్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై ఓ బ‌స్సు లోయలో పడిపోవ‌డంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పంచముఖి ధర్మశాలకు చెందిన లక్ష్మన్ సింగ్ కుమారుడు మనోజ్ సింగ్​ పెళ్లికి వీరంతా వెళ్లారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ తర్వాత వీరంతా మహీంద్ర మ్యాక్స్ వాహనంలో తిరిగి తమ స్వస్థలాలకు బయల్దేరారు. తెల్ల‌వారుజామున‌ వాహనం అదుపు తప్పింది. ఒక్కసారిగా రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. మృతులంతా లక్ష్మన్ సింగ్ బంధువులేనని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స‌మీపంలోని ఆస్పత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement