Sunday, May 5, 2024

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి…

మేడ్చల్ నియోజకవర్గం తుంకుంట మున్సిపాలిటీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలో దాదాపు 2,800 మంది మహిళా సోదరీమనులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అలాగే మున్సిపాలిటీకి మంజూరైన కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ (19) చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ వాణి వీర రెడ్డి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement