Tuesday, May 7, 2024

భార్య‌ని 25సార్లు క‌త్తితో పొడిచిన భ‌ర్త‌-విష‌మంగా బాధితురాలి ప‌రిస్థితి

పెళ్ల‌యిన మూడు నెల‌ల‌కే ఆ దంప‌తుల మ‌ధ్య వివాదాలు త‌లెత్తాయి. వివ‌రాలు చూస్తే..26ఏళ్ల ప్రసాద్ కు కొరుక్కుపేటలోని ఎగప్పన్ వీధికి చెందిన తమిళ్ సెల్వి (18)తో ఇటీవలే వివాహం జరిగింది. ప్రసాద్ ఆటోరిక్షా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మూడు నెలలు సంసారం బాగానే సాగింది. కానీ, మూడు నెలల తర్వాత భర్త క్రూరత్వం భయటపడింది. ప్రశ్నించినందుకు తన భార్యపై మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ ప్రసాద్ కత్తితో దాడి చేశారు. నిత్యం మద్యం తాగివస్తుండటంతో మహిళ.. తన భర్తను ప్రశ్నించింది. కొన్ని రోజులుగా నిత్యం తాగి వస్తూ.. భార్యతో గొడవపడుతుండే వాడు. ఈ క్రమంలోనే ఆవేశానికి లోనైన భర్త.. తన భార్యపై కత్తితో దాడి చేశాడు. 25 సార్లు కత్తితో పొడిచి ఆమెను గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు అరవడంతో ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి అని పోలీసులు తెలిపారు. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement