Tuesday, May 7, 2024

మహత్మ జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు..

చౌదరిగూడెం : మండలంలోని బస్టాండ్‌ ఆవరణలో మహనీయులు మహత్మ జ్యోతి రావు పూలే జయంతి వేడుకలను మండల టిఆర్‌ఎస్‌ నాయకులుఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస మండల అధ్యక్షులు సయ్యద్‌ హఫీజ్‌ మాట్లాడుతూ జ్యోతిరావుపూలే దేశంలో జరుగుతున్న కుల వివక్షపై పోరాటం చేశారు. ఆడిపిల్లలు చదువుకోవడానికి ఎంతో కృషి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గూడ స్వామి, ఎంపిటిసి రాములు, సీనియర్‌ నాయకులు యాదయ్య, నర్సిములు, బాలరాజు, ఎస్సీ సెల్‌ ప్రెసిండెంట్‌ మల్లేష్‌, విరన్న, శేఖర్‌, బాబయ్య, భాస్కర్‌ గౌడ్‌, రాములు నాయక్‌, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement