Friday, April 26, 2024

పేద‌ల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ ఓ వ‌రం.. మంత్రి మ‌ల్లారెడ్డి

పేద‌ల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ ఓ వ‌ర‌మ‌ని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఫిర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేషన్ కి తెలంగాణ ప్రభుత్వంచే మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. 27మందికి మంత్రి తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంకట్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణ, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement