Wednesday, April 24, 2024

ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసు.. సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం..

రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఈ కేసులోని నిందితులు సిట్ విచారణ వద్దని, సీబీఐతో విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కేరళ బీడీజెఎస్ అధ్యక్షుడు తుషార్ కోరుతున్నారు. సీఎం కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే దర్యాప్తు సాగుతోందని ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న తనకు దురుద్దేశంతో లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement