Sunday, April 28, 2024

RR: శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసిన అఖిల భారత గిరిజన సంఘం నాయకులు

వికారాబాద్, డిసెంబర్ 31(ప్రభ న్యూస్): తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదివారం నాడు అఖిలభారత ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శాసన సభాపతి ని కలిసి అఖిల భారత గిరిజన సమాఖ్యరాష్ట్ర కమిటీ నాయకులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. రాఘవన్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మరియు వికారాబాద్ శాశనసభ సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్‌ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, పూల గుచ్చంతో సన్మానించారు

గిరిజన, బంజారాల సంక్షేమం, అభివృద్ధి కి సహకరించాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు గుగులోత్ వెంకన్న నాయక్,రాష్ట్ర కన్వీనర్ వినయ్ పవార్,రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు సురేష్ నాయక్,అఖిలేష్ నాయక్,కార్యదర్శి గోవింద్ నాయక్, అగ్రికల్చర్ ఏడి శంకర్ నాయక్,రాష్ట్ర నాయకులు రాథోడ్ దేవేందర్ నాయక్, రాథోడ్ రవీందర్ నాయక్,రవి నాయక్ తెలంగాణ పంచాయతి సెక్రటరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement