Friday, May 3, 2024

Bhupalpalli:ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బ‌స్సు, డీసీఎం ఢీ

భూపాలప‌ల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రేగొండ మండ‌లంలోని భాగిర్తిపేట, కొత్తపల్లి గ్రామాల్లోని ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 25 మంది ఉన్నారు. అందులో 10 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement