Wednesday, May 1, 2024

వికారాబాద్ జిల్లాలో పూర్తిస్థాయిలో నిండిన ప్రాజెక్టులు

వికారాబాద్, జులై 26 ( ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లాలోని ఆరు మధ్యతరహా నీటిపారుదల శాఖ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. ఇందుకు సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని కోటిపల్లి, నంది వాగు, జుంటుపల్లి, సర్పన్ పల్లి శివసాగర్, అల్లాపూర్ వాగులు పూర్తిస్థాయిలో నుండి పొంగి ప్రవహిస్తున్నాయి.

ఈ కారణంగా ప్రాజెక్టు నుండి ఆయా గ్రామాలకు వెళ్లే కాలువలు నీటితో పారుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప వాటి వద్దకు వెళ్లకూడదని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement