Thursday, May 2, 2024

తొర్రూరు ప్లాట్లకు ఫుల్​ డిమాండ్​.. ఫస్ట్​ డే వేలంలో 41 ప్లాట్ల విక్రయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తొర్రూరు మునిసిపాలిటీ పరిధిలో హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) రూపొందించిన తొర్రూరు లేఅవుట్‌లో ప్లాట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. రెండోదఫా 140 ప్లాట్లను వరుసగా మూడు రోజులపాటు ఆన్‌లైన్‌ వేలం ద్వారా హెచ్‌ఎండీఏ విక్రయించనుంది. ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియలో భాగంగా శుక్రవారం రెండు సెషన్లలో 42 ప్లాట్లకు జరిగిన ఆన్‌లైన్‌ వేలంలో 41 ప్లాట్లకు కొనుగోలుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు.

మార్నింగ్‌ సెషన్‌లో అత్యధికంగా గజం రూ.33వేల ధర పలుకగా, అత్యల్పంగా గజం రూ.23వేలు పలికింది. ఈవినింగ్‌ సెషన్‌లో అత్యధికంగా రూ.35,500 బిడ్‌ చేయగా, అత్యల్పంగా గజం రూ.21వేల ధర పలికింది. శుక్రవారం రూ.33.58 కోట్ల విలువజేసే 41 ప్లాట్లు ఆన్‌లైన్‌ వేలం ద్వారా అమ్మకాలు జరిగాయి. మిగతా 106 ప్లాట్లకు శనివారం, తిరిగి సోమవారం ఆన్‌లైన్‌ వేలం ద్వారా బిడ్డింగ్‌ జరుగనున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement