Thursday, May 2, 2024

ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ కు ఫిర్యాదు..

వికారాబాద్‌ : జిల్లాలోనిఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లు,హోటళ్లలో విక్రయిస్తున్న తిను బండారాలను తనిఖి చేయాలని కోరుతు వికారాబాద్‌ జిల్లా ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ సునీతకి,వికారాబాద్‌ జిల్లా హ్యుమన్ రైట్స్‌ చైర్మన్‌ గాండ్ల శివానందం ఫిర్యాదు చేశారు.వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఫుడ్‌ ఇన్స్‌ పెక్టర్‌ తనిఖిలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన సునీతను కలిసి ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా శివానందం మాట్లాడుతు హోటళ్లు,ఫుడ్‌ సెంటర్‌లలో కల్తీ విషయం గతంలో మున్సిపల్‌ కమీషనర్‌కు సంబందిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోనని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement