Thursday, April 18, 2024

టీఆర్ఎస్ తోనే అభివృద్ది సాధ్యం – ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్


ఖిలావరంగల్, : టీఆర్ఎస్ తోనే అభివృద్ది సాద్యం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం నగరంలోని 42వ డివిజన్ రంగశాయిపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి కేడల పద్మ- జనార్థన్ కు మద్దతుగా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎంపి బండా ప్రకాశ్, మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ బిందుతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాను అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తామన్నారు. ప్రజలు కోరిన ప్రతీ పనిని చేస్తామని, 60 ఏండ్లలో జరగని అభివృద్దిని 6ఏండ్లలో చేసి చూపించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంపై ప్రత్యేక శ్రద్ద పెట్టి అభివృద్ది చేస్తున్నారని, వరంగల్ అభివృద్దిని చూసి టీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. ఇక్కడ కొందరు పార్టీకి వ్యతిరేఖంగా నామినేషన్ వేసారని, వారిని పార్టీ కాపాడుకుంటుందని సూచన చేసినా వారు విరమించుకోలేదన్నారు. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని, పార్టీకి నష్టం చేకూర్చే వారిని సస్పెండ్ చేస్తామని, వారిని తిరిగి చేర్చుకునే అవకాశం కూడా ఉండదన్నారు. ప్రజలు మావెంట ఉన్నారని, మేం చేసిన అభివృద్ది ప్రజల కళ్ళముందుందన్నారు. అభివృద్దిని చూసి ఓటేయాలన్నారు. ఇటీవల ఆత్మీయులు తన కుమారుని కోల్పోయిన బాదలో ఉన్న కేడల పద్మకు ప్రజలంతా అండగా నిలవాలన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు. ప్రతీ ఇంటికి సంక్షేమాన్నందించి ప్రతీ ముఖంలో ముఖ్యమంత్రి సంతోషాన్ని నింపుతున్నారని, వరంగల్ నగరాభివృద్ది టీఆర్ఎస్ తోనే సాద్యమని, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement