Monday, April 29, 2024

విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ క్రికెటర్

ఇప్పటికే విరాట్ కోహ్లీ పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలు కొట్టిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరో రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 2వేల పరుగుల మార్క్‌ను చేరుకున్న బ్యాట్స్‌మన్‌గా బాబర్‌ నిలిచాడు. ఈ క్రమంలోనే కోహ్లీ పేరిట ఉన్న రికార్డును పాక్‌ సారథి అధిగమించాడు. ఆజం కేవలం 52 ఇన్నింగ్స్‌ల్లోనే 2వేల మైలురాయిని చేరుకున్నాడు. జింబాబ్వేతో చివరిదైన మూడో టీ20లో బాబర్‌ 52 రన్స్‌ సాధించడం ద్వారా ఈ మార్క్‌ అందుకున్నాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 11వ బ్యాట్స్‌మన్‌గా బాబర్‌ నిలిచాడు. పాకిస్థాన్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన మూడో క్రికెటర్‌. బాబర్‌ కన్నా ముందు మహ్మద్‌ హఫీజ్‌(2388), షోయబ్‌ మాలిక్‌(2335) రెండు వేల పరుగుల మార్కును అధిగమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement