Saturday, May 4, 2024

కలెక్టరేట్ వద్ద బొమ్మరాసిపేట రైతుల ధర్నా… అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రభ న్యూస్ ప్రతినిధి, మేడ్చల్ జులై 15: మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం బొమ్మరాసిపేట రైతులు శనివారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న రైతులు, మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి, శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, బొమ్మరాసిపేట గ్రామ భూ సర్వే నెంబర్లు 323 నుంచి 409 వరకున్న భూముల్లో పాస్ పుస్తకాల మంజూరుకు ఎటువంటి లావాదేవీలు జరపకూడదంటూ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను విస్మరించి, జిల్లా కలెక్టర్ స్లాట్ బుక్కింగ్ కు అవకాశం కల్పించటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిని నిరసిస్తూ రైతులు ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నా కు బాధిత రైతు కమిటీ నాయకులు బాబుల్ రెడ్డి, సత్యనారాయణ రావు, రాంచెందర్ రావు, కే.వి.రమణారెడ్డి, డా.రామయ్య, కే.శ్రీనివాసరెడ్డి, రవికిరణ్ రెడ్డిలు నాయకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement