Saturday, April 27, 2024

యాక్ట్​ ఫైబర్​ నెట్​ సరిచేస్తుంటే విద్యుత్ షాక్.. మేడ్చల్​ జిల్లాలో వ్యక్తి మృతి

మేడ్చల్ (ప్రభన్యూస్): విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో ఇవ్వాల (శుక్రవారం) సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం దాదాపు 7 గంటల సమయంలో మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని కిష్టాపూర్ శ్మశాన వాటిక సమీపంలోని విద్యుత్ ఫోల్ వద్ద నిచ్చెన వేసి ఆక్ట్ ఫైబర్ పనులు చేస్తున్న వ్యక్తి కరెంట్​ షాక్​కి గురయ్యాడు. ఝార్ఖండ్ కు చెందిన దిలీప్ పింగువ (22) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో స్తంభం పై నుండి కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement