Friday, May 3, 2024

విద్యుత్తు, పెట్రో ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ధర్నా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు, పెట్రో, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల నియోజకవర్గం నుంచి టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షాబాద్ దర్శన్, మొయినాబాద్ మండల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తమ్మలి మాణయ్య , PACS చైర్మన్ చంద్రారెడ్డి, ఎంపిటిసి రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి రవీందర్ రెడ్డి, మండల ఓబిసి విభాగం ఉపాధ్యక్షులు మహేందర్ ముదిరాజు, కాంగ్రెస్ నాయకులు చిలుకూరు ప్రభాకర్, కావలి రమేష్, శేఖర్, మహేష్, తదితర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement