Tuesday, April 30, 2024

క్యాలెండర్‌ ఆవిష్కరణ..

యాచారం : పట్టణ కేంద్రంలో రంగారెడ్డి జిల్లా మాజీ ప్రజాప్రతినిధుల సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ప్రజా ప్రతినిధుల రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లిక్కి నర్సింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మాజీ ప్రజా ప్రతినిధుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి అండగా తాము ఉంటామని అన్నారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకొని క్యాలెండర్‌ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు బోడ కృష్ణ, రాష్ట్ర నాయకులు ఆకుల బిక్షపతి, యాచారం మండలానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కాశమల్ల యాదయ్య, మాజీ ప్రజాప్రతినిధులు యాదయ్య, వెంకటయ్య, జంగయ్య, సురేందర్‌రెడ్డి, రంగారెడ్డి, మల్లేష్‌, మోతిరామ్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement