Saturday, April 20, 2024

కరోనా టెస్టుల కోసం క్యూ..

యాచారం : పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా టెస్టుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. మండలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం వల్ల లక్షణాలు ఉన్న వారు కరోనా టెస్టులు చేయించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 46మందికి కరోనా ర్యాపిడ్‌ టెస్టులు చేయగా 18 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. యాచారం 3, మాల్‌ 3, బానుతండా 3, గున్‌గల్‌ 2, నందివనపర్తి 1, తాడిపర్తి 1, చింతపట్ల 1, గాండ్లగూడ 1, తక్కళ్లపల్లి తండా 1, బాషమోనిగూడ 1, మంతన్‌గౌడ్‌ 1 పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కరోనా దినదినానికి విజృంభిస్తుండటం వల్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అనవసరమైన వాటికి రోడ్ల మీద తిరగరాదని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ మాస్కులను దరించాలని ప్రభుత్వ వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement