Thursday, May 2, 2024

శంకర్ పల్లిలో వైభవంగా బోనాల సంబరాలు

శంకర్పల్లి మున్సిపాలిటీ కేంద్రంలో బోనాల పండుగ సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పోచమ్మ ఆలయ పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. మహిళలు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయానికి బోనాలతో నైవేద్యాలతో ఆలయానికి విచ్చేసి తమ ఇష్ట దైవానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఆలయ కమిటీ వారు పెద్ద ఎత్తున విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. శంకరపల్లి మున్సిపాలిటీ అధికారులు గ్రామదేవతల ఆలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు ముందస్తు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో గ్రామ దేవతల ఆలయాలకు భక్తుల తాకిడి భారీగా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement