Saturday, May 4, 2024

ట్రాక్టర్ ను ఢీకొట్టిన టాటా ఏస్.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

ట్రాక్టర్ ను టాటాఏస్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. తెల్లవారుజామునే దైవదర్శనానికి బయలుదేరిన 20మందితో కూడిన వాహనం వేగంగా వెళుతూ ప్రమాదానికి గురయ్యింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కటికంవారిపల్లె గ్రామానికి చెందిన కొందరు మదనపల్లె సమీపంలోని బోయకొండ గంగమ్మ తల్లి ఆలయానికి బయలుదేరారు. టాటా ఏస్, టాటా సుమో వాహనాల్లో 20మంది తెల్లవారుజామున బయలుదేరారు.

ఈ క్రమంలో టాటా ఏస్ వాహనం జాతీయ రహదారిపై వేగంగా వెళుతూ చిన్నిఒరంపాడు సమీపంలో అదుపుతప్పింది. దీంతో ముందు వెళుతున్న ట్రాక్టర్ ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని నర్సింలు(57) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. శంకరమ్మ(60) అనే మహిళను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. మరో ఐదుగురు కూడా తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే మరో వాహనంలోని వారు గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి మృతులు, క్షతగాత్రుల వివరాలను తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement