Sunday, May 5, 2024

సోమారంలో గిరిజన గురుకులానికి మంత్రుల‌ భూమిపూజ

రాష్ట్ర మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, మ‌ల్లారెడ్డిలు రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. మేడ్చ‌ల్ మండలం సోమారం గ్రామంలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల) రూ. 4.20కోట్లతో చేపట్టిన నిర్మాణానికి భూమిపూజ చేశారు. గురువారం మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి హాజరై భూమిపూజ చేశారు. సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ నర్సింహా రెడ్డి, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజయందర్ రెడ్డి, తుంకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, నాయకులు, అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement