Sunday, May 19, 2024

ఆటో బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు.. శంక‌ర్‌ప‌ల్లి మండ‌లంలో ఘ‌ట‌న‌

శంకర్ పల్లి (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో ఆటో బోల్తాప‌డ్డ ఘ‌ట‌న శనివారం జ‌రిగింది. ఏల్వర్తి గ్రామ పరిధిలోని ప్రధాన రోడ్డులో ఉన్న మూలమలుపు వద్ద ట్రాలీ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ఏడుగురికి సాధారణ గాయాల‌య్యాయి. శంకర్ పల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగరాజు సమాచారం మేరకు.. కమ్మెట గ్రామానికి చెందిన మాసేట్టి ఉసిరయ్య అనే డ్రైవర్ తన ట్రాలీ ఆటోలో 12 మందిని ఎక్కించుకొని శంకర్ పల్లి కి వస్తున్నాడు.

ఈ క్రమంలో మండలంలోని ఎల్వర్తి ప్రధాన రోడ్డు మూలమలుపు వద్ద ఆటో బోల్తా పడగా అందులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సాధారణ గాయాలు అయిన ఏడుగురిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగరాజు చెప్పారు. చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన అలకుంట పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement