Tuesday, May 14, 2024

మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు మృతి

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండల పరిధిలోని ఆలం ఖాన్ గూడ గ్రామంలో మద్యం మత్తులో యువకుడు మృతి చెందిన సంఘటన జరిగింది, శంకర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి తెలిపిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి, ఆలం ఖాన్ గూడ గ్రామానికి చెందిన కైల మల్లారెడ్డి తండ్రి కిష్టారెడ్డి వయసు 32 సంవత్సరాలు మద్యం మత్తులో పురుగుల మందు తాగగా గ్రామంలో చూసినవారు 108 కి ఫోన్ చేయగా చందానగర్ మేడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు, చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం ఆయన మృతి చెందారు, మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని చట్టరీత్యా చర్యలు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement