Sunday, April 28, 2024

VKB | వికారాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన పిచ్చికుక్క.. 8 మందికి తీవ్ర గాయాలు

బొంరాస్ పేట్, (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లాలో పిచ్చికుక్క రెచ్చిపోయింది. ఎనిమిది మందిపై దాడి చేయ‌గా తీవ్ర గాయాల‌య్యాయి. అందులో ఆరుగురు చిన్నారులున‌నారు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ మండలం రేగడి మైలారంలో జ‌రిగింది. పిచ్చి కుక్క స్వైర‌ విహారం చేసి 8 మందిపై దాడికి పాల్పడింది. గురువారం ఉదయం పాఠశాలకు బయలుదేరిన ఆరుగురు చిన్నారులు నర్మదా, చిన్న, మమతతో పాటు మరో ఇద్దరు పెద్దలు కుమ్మరి రాములు, ఫుల్ సింగ్ పై విరుచుకుపడింది.

కుక్క దాడితో చిన్నారులు ఎడ్పులు, పెడబొబ్బలె పెట్టారు. వారి రోదనలు మిన్నంటడంతో గమనించిన గ్రామస్తులు కుక్కను తరిమేసి బాధితులను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.నలుగురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామాలలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న‌ కుక్క లను అదుపు చేయాల‌ని గ్రామ‌స్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement