Friday, May 3, 2024

మహేశ్వరం రోడ్డు వెడల్పు పనులకు రూ.14.20 కోట్లు మంజూరు : మంత్రి సబితారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో నియోజకవర్గంలోని రోడ్లకు మహర్ధ‌శ లభిస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రం మహేశ్వరం నుండి తుమ్మలూర్ మీదుగా జాతీయ రహదారి 765 వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.14.20 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సింగల్ లైన్ గా ఉన్న రోడ్డును డబుల్ రోడ్డుగా వెడల్పు చేస్తూ ఆధునికరించనున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో రోడ్ల, జంక్షన్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్నాయని మంత్రి అన్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజల తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement