Friday, May 17, 2024

జడ్పీ ఛైర్ పర్సన్ డా.అనితారెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు

గచ్చిబౌలి హయత్ హోటల్ లో ప్రతిష్టాత్మక Hi9 డాక్టర్స్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా ‘ఉత్తమ డాక్టర్ లీడర్’ గా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి అవార్డు అందుకున్నారు. ప్రజాప్రతినిధిగా, డాక్టర్ గా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. ప్రతిష్టాత్మక Hi9 డాక్టర్స్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా ‘ఉత్తమ డాక్టర్ లీడర్’ విభాగంలో అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సత్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement