Friday, May 3, 2024

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం

తాండూరు : చిన్నారులతో పాటు గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని బీజేపీ కౌన్సిలర్‌ సంగీత ఠాకూర్‌ అన్నారు. వార్డు నెంబర్‌ 20లోని అంగన్‌వాడి కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అంగన్‌వాడి కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారంపై గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. కొవిడ్‌ కారణంగానే అంగన్‌వాడి కేంద్రంలో అందించాల్సిన పౌష్టికాహాన్ని ఇంటింటికి పంపించడం జరుగుతుందని తెలిపారు. చిన్నారులతో పాటు గర్భిణీలు, బాలింతలు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పౌష్టికాహారంతోనే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌, ఆయాలు, చిన్నారుల తల్లిదండ్రులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement