Sunday, May 19, 2024

RANGAREDDY | బీఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్స్ అన్ని సూప‌ర్ హిట్టే సూప‌ర్ హిట్టే

కేసీఆర్ అంటే నమ్మకం..కాంగ్రెస్ అంటే నాటకం అంటూ మంత్రి హ‌రీష్‌రావు కాంగ్రెస్ సెటైర్ వేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో మంత్రి హ‌రీష్‌రావు ప్ర‌చారం నిర్వ‌హించారు. బీఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్స్ అన్ని సూప‌ర్ హిట్టే సూప‌ర్ హిట్టేఅన్నారు. మరోసారి బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో ఇబ్రహీం పట్నం రూపు రేఖలు మారిపోయేలా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఎంతో లబ్ది చేకూరుస్తున్న రైతు బంధు పథకాన్ని ఆపేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ వస్తే రైతు బంధు పథకం ఉండదని రైతులు సంతోషంగా ఉండాలంటే కేసీఆర్ మరోసారి సీఎం కావాలన్నారు.

ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని సూచించారు. ప్రజల కోసం ఆలోచించే నేత కావాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆ కష్టాలు పోయాకని రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు నిర్మించుకుంటున్నామని అన్నారు. దీంట్లో భాగంగా ఇబ్రహీం పట్నం,మహేశ్వరం నియోజక వర్గాల మధ్య పెద్ద మెడికల్ కాలేజీని నిర్మించుకోబోతున్నామని దాని కోసం ఇప్పటికే శంకుస్థాపన కూడా పూర్తి అయిన విషయాన్ని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని మోసకారుల చేతిలో పెట్టవద్దని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. నీటి ప్రాజెక్టులు కట్టి సాగునీరు, తాగునీటి కష్టాలు తీర్చిన కేసీఆర్ కు ఓటు వేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement