Friday, April 26, 2024

Nizamabad – డి సి సి బి చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక..

నిజామాబాద్ ప్రతినిధి (ప్రభ న్యూస్) – రైతు సంక్షేమమే ధ్యేయంగా పాటుపడతానని, బ్యాంకు ని లాభాల బాటలో తీసుకురా వడానికి కృషి చేస్తానని డిసిసిబి బ్యాంక్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. డిసీసీబి బ్యాం కులో చైర్మన్ ఎన్నికపై పాలక వర్గ సమావేశం నిర్వహించారు. చైర్మన్ ఎన్నిక కోసం ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో చైర్మన్గా కుంట రమేష్ రెడ్డిని ఏకగ్రీవంగా ప్రకటించారు.

అనంత‌రం పదవి బాధ్యతలు చేపట్టిన రమేష్ రెడ్డి కి పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుంట రమేష్ రెడ్డి మాట్లా డుతూ..త‌న‌ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు డైరెక్టర్లకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహ కరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్ లకు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞత లు తెలిపారు.

జిల్లా రైతన్నలకు తన సహకారం ఉంటుందని, రైతులకు, డైరెక్టర్లకు ఉద్యో గులకు ఎల్లప్పుడూ అందుబా టులో ఉంటారని అన్నారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవం చేసినందుకు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా బ్యాంకు అభివృద్ధికి తోడ్పడు తానని అన్నారు. సహచర డైరెక్టర్లకు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతు న్నామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కుంట రమేష్ రెడ్డి అభిమానులు టపాకా యలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement