Friday, April 26, 2024

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: జగిత్యాల జిల్లా కలెక్టర్

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలతో ఎస్సారెస్పి, కడేం ప్రాజెక్టు ద్వారా లక్షా 50వేల క్యూసెక్ ల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేయడం జరిగినందున గోదావరి పరివాహక, లోతట్టు ప్రాంతాలలో అధికారులు అప్రమత్తం కావాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి. రవి పేర్కోన్నారు. సోమవారం వివిధ అన్ని శాఖల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్, భారీవర్షాలతో ఎగువ ప్రాంతాలలో ప్రాజెక్టులలో నిండిన నీటిని దిగువకు విడుదల చేసినందున గోదావరి పరివాహక మండలాల్లో, లోతట్టు ప్రాంతాలలో అధికారులు అప్రమత్తమై జాగ్రత్తగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నుండి నీరు ప్రవహిస్తున్న, ఉప్పొంగి పొర్లుతున్న కాలువల వైపు రాకపోకలను పూర్తిగా మూసివేయాలని, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి కావాల్సిన ఆహారం వంటి మౌళిక వసతులు కల్పించాలని అన్నారు.

పాతఇళ్లు, గోడలు పడిపోయో స్థితిలో ఉన్నవాటిని గుర్తించి, ఎక్కడాకూడా ఎటువంటి నష్జం వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. వర్షాల వలన వరదలు ఉదృతంగా ప్రవహించే అవకాశాలు ఉన్నందును గ్రామాలు, పట్టణాలలో అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక సానిటేషన్ కార్యకమాలు చేపట్టాలని, వర్షాలతో నీరునిలిచి దోమలు తయారవకండా ఆయిల్ బాల్స్, గంబుషియా చేపలు వదలడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని, రోడ్లపై నీరు నిలువకుండ నీటిని తొలగించే చర్యలు తీసుకోవాలని, ఖాళీ ప్రదేశాలలో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని అన్నారు. కరోనా ప్రబావంతో చాలా కాలం తరువాత విద్యాసంస్థలు తెరుచుకున్న సందర్బంగా పాఠశాలు, కళాశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రతిఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని, టీచర్లు, మద్యాహ్న భోజనం తయారు చేసే వారు, 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతిఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోని, తీసుకోవాల్సిన వారి వివరాలను సేకరించి నివేదికను పంపినట్లయితె వారికి రానున్న 2రోజుల్లో వ్యాక్సిన్ అందించే చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కోన్నారు.

ఇక పిల్లలో కోవిడ్ పై అవగాహన కల్పించి, ఇంటివద్ద ఏవిధంగా ఉండాలో టీచర్లు తెలియజేయాలని, ప్రజలు ఎక్కువగా గుమ్మిగుడి ఉండే ప్రదేశాలలొ ప్రతిఒక్కరు ఖచ్చితంగా మాస్క్, సామాజికదూరాన్ని పాటించేలా చూడలాని, వర్షాల కారణంగా పాఠశాల పరిసరాలలో నీరునిలిచి పడిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతిధరఖాస్తుపై అధికారులు చర్యలు తీసుకోని, పెండింగ్ లేకుండా చూడాలని, హరితహారం కార్యక్రమం ద్వారా పల్లెప్రకృతి వనం, బృహత్ పల్లెప్రకృతి వనాలలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేలా మున్సిపాలిటి, పంచాయితీ అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ప్రొ.కబడ్డీ: తెలుగు టైటాన్స్ జట్టులో ఆడనున్న పాలమూరు బిడ్డ

Advertisement

తాజా వార్తలు

Advertisement