Thursday, April 25, 2024

చిత్తూరు జిల్లాలో 16 పురాతన నాణేలు లభ్యం

చిత్తూరు నగరంలోని నీవా నది ఒడ్డున ఉన్న వీరభద్ర కాలనీలో ఓ మహిళ ఇంట్లో 16 పురాతన నాణేలు దొరికాయి. వాటిని చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నాణేలను పురావస్తుశాఖ అధికారులకు అప్పగించి విచారణ జరిపిస్తామని చిత్తూరు తహసీల్దార్ సుబ్రమణ్యం తెలిపారు. నాణేలకు బంగారు పూత పూసి ఉందని.. ఈ నాణేలను వెలికి తీయడానికి మహిళ ఇంట్లో కొందరు పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement