Sunday, April 28, 2024

బుమ్రా బంతి అడిగి మరి వికెట్లు తీశాడు: విరాట్ కోహ్లీ..

ఇంగ్లండ్ తో నాలుగో టెస్ట్ విజయంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. తాము గెలవాలనే కసితోనే బరిలోకి దిగినట్లు తెలిపారు. ‘మేం గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు పట్టుదల చూపించారు. గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం.  అలాగే ఈ జట్టులోని ముగ్గురు టాప్‌ బౌలర్ల ప్రదర్శన చూసిన కెప్టెన్‌గాను ఎంతో సంబరపడుతున్నా. క ఈ మ్యాచ్‌లో వాతావరణం వేడిగా ఉండటంతో మేం గెలిచే అవకాశం ఉందని ముందే అనుకున్నాం. ఈ క్రమంలోనే బౌలర్లు అదరగొట్టారు. బుమ్రా, జడేజా మాయచేశారు. ముఖ్యంగా బంతి రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలంగా ఉందని తెలియగానే బుమ్రా బంతి ఇవ్వాలని కోరాడు. దాంతో అతడికి బంతి ఇవ్వగానే రెండు (ఓలీపోప్‌, బెయిర్‌స్టో) కీలక వికెట్లు తీశాడు. ఇక రోహిత్‌, శార్దూల్‌ కూడా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు.

ముఖ్యంగా శార్దూల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మెరిశాడు. అతడి ప్రదర్శన అత్యద్భుతం. అతడి రెండు అర్ధశతకాలు ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాయి. అయితే, ఈ విజయాన్ని ఆస్వాదించడానికి కోచ్‌ రవిశాస్త్రి, ఇతర సిబ్బంది అందుబాటులో లేరు. అయినా, ఈ విజయాన్ని చూసి ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లంతా సంతోషిస్తారు. ఈ గెలుపు రాబోయే మ్యాచ్‌లో మాకు ప్రేరణగా నిలుస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ఇక మా గురించి బయట ఎవరేమునుకున్నా పట్టించుకోం. ఏ నిర్ణయమైనా జట్టంతా కలిసే తీసుకుంటాం’’ అంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: ఓవల్ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ

Advertisement

తాజా వార్తలు

Advertisement