Thursday, May 2, 2024

Railways – రైల్వే అధికారుల త‌ల‌తిక్క నిర్ణ‌యాలు – ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌యాణీకులు

శంకరపల్లి (ప్రభ న్యూస్) చేవెళ్ల నియోజకవర్గం లో ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ శంకరపల్లి రైల్వే స్టేషన్, శంకరపల్లి మున్సిపాలిటీ జనాభా దాదాపు 30,000 ఉంటుంది, ఈ రైల్వేస్టేషన్ లోని రైళ్ల ద్వారా బీడీఎల్ మరియు ఓడిఎఫ్ ఉద్యోగులు స్థానికంగా వ్యాపారులు ఉద్యోగులు విద్యార్థులు ఒకవైపు హైదరాబాద్ మరొకవైపు వికారాబాద్ తాండూర్ వరకు రాకపోకలు నిర్వహిస్తూ ఉంటారు, అతి ముఖ్యమైన ఔరంగాబాద్ ప్యాసింజర్ రైలు శంకర్ పల్లి లో ఆగదు, మూడు కిలోమీటర్ల దూరంలో 3000 జనాభా ఉన్న రావులపల్లి కలాన్ లో ఈ రైలు ఆగుతుంది.

దీనివల్ల ఎవరికి ఉపయోగం అంతుచిక్కడం లేదు, రైల్వే అధికారులు ఈ తప్పును సరి చేయండి మూడు వేల జనాభా ఉన్న దగ్గర ఈ రైలు ఆగడమేంది, 30 వేల జనాభా ఉన్న దగ్గర ఈ రైలు ఆగకపోవడమేమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement