Friday, April 26, 2024

KNR | బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రఘునందన్

కరీంనగర్ బార్ అసోసియేషన్ కు ఇవ్వాల (శుక్రవారం) ఎన్నికలు జరిగాయి. ఈ సాయంత్రం ఫలితాలను ఎన్నికల అధికారి ఎం.రామకృష్ణ చారి ప్రకటించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రఘునందన్ రావు, ఉపాధ్యక్షుడిగా వాల మహేందర్ రావు , ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి నాగరాజు ఎన్నికయ్యారు. కోశాధికారిగా కొట్టె తిరుపతి, లైబ్రరీ కార్యదర్శిగా ఎం. సంపత్ , స్పోర్ట్స్ కల్చరల్ కార్యదర్శిగా ఓంకార్ ఎన్నికయ్యారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పెంచల శ్రీనివాసరావు, జగదీశ్వర చారి, మధు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఆంజనేయులు, హరికృష్ణ, బొజ్జ స్వామి ఎన్నికయ్యారు.

కార్యదర్శి పదవికి సిరికొండ శ్రీధర్ రావు, మహిళా ప్రతినిధిగా హేమలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో 929 మంది ఓటు హక్కు కలిగి ఉండగా 834 ఓటేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, సూడా చైర్మన్ జివి రామ కృష్ణారావు, గ్రంథాలయ చైర్మన్ అనిల్ గౌడ్ సీనియర్, జూనియర్, మహిళ న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement