Friday, April 26, 2024

సూర్యాపేటలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా

సూర్యాపేట జిల్లాలోని కోదాడ 65వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది  ప్రయాణిస్తున్నారు. బస్సు సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement