Friday, April 19, 2024

కరోనా తో యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ మృతి

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.తాజాగా కరోనాతో యంగ్ డైరెక్టర్ మృతి చెందారు.2017లో శ్రీవిష్ణుతో మా అబ్బాయి సినిమాను తీసిన యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి.. కరోనా
వైరస్ బారినపడి కన్నుమూశాడు.

కొన్నిరోజులుగా కరోనా తో బాధపడుతున్నారు.అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. కుమార్ స్వస్థలం
శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట. ప్రముఖ దర్శకుడు పరశురామ్ దగ్గర డైరెక్షన్ నేర్చుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement