Friday, May 3, 2024

President : పోచంపల్లిలో ద్రౌపది ముర్ము పర్యటన

ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలోపర్యటించనున్నారు. టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించనున్నారు.

చేనేత కార్మికులతో సమావేశం కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు. 350 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖీలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మరోవైపు రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement