Saturday, May 4, 2024

Posani Punch – ప‌వ‌న్ మంచోడు – లోకేష్ తిరుగుబోతుః పోసాని

హైద‌రాబాద్ – జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ వాలంటీర్ల‌పై చేసిన వ్యాఖ్యాలు టిడిపి అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ వేన‌ని సినీ న‌టుడు,ర‌చ‌య‌త‌, వైసిపి నేత పోసాని కృష్ణ‌ముర‌ళి అన్నారు. ఆ ఇద్ద‌రి మాయలో ప‌డి ప‌వ‌న్ ఇటువంటి అన‌స‌వ‌ర వివాదాల్లోకి వ‌స్తున్నార‌ని వ్యాఖ్యానించారు.. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ తిరుగుబోతు, తాగుబోతు..ఆయన లాగా వాలంటీర్లు ఎవరూ తిరగలేదన్నారు .శ్రీ కృష్ణుడు గోపిలలతో సరసాలు ఆడినట్లు చంద్రబాబు కొడుకు లోకేష్ సరసాలు ఆడాడ‌ని,అప్పుడు వారిని ప‌వ‌న్ ఎందుకు అడగలేదని నిల‌దీశారు. అస‌లు నీకు ట్రాఫికింగ్ అంటే నీకు తెలుసా పవన్ కళ్యాణ్? అంటే ప్ర‌శ్న‌లు కురిపించారు.

భీమవరంలో చంద్ర‌బాబే ఓట‌ర్ల‌కు రూ 15 కోట్లు ఇచ్చి ప‌వ‌న్ ను ఓడించార‌ని ఆరోపించారు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో కూడా ప‌వ‌న్ ను చంద్ర‌బాబు మ‌రోసారి ఓడిస్తారంటూ, ఇప్ప‌టికైన ప‌వ‌న్ క‌ళ్లు తెర‌వాల‌న్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్రబాబు, ఆయన కొడుకు పుణ్యమా అని డేటా చోరీ జరిగిందని.. హైదరాబాద్ ఉన్నప్పుడు చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రజల డేటా తీసుకున్నారని అన్నారు.. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ టిడిపి నేత‌ల‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌న్నారు.. ప‌వ‌న్ అనేక త‌ప్పులు చేశారని, తెలిసి తెలియక చేసిన వాటికి చిరంజీవి క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు దృష్టిలో పవన్ ఓ వాన పామ‌ని,అయితే త‌మ దృష్టిలో మంచివాడన్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడి అందరికి దూరం అవుతున్నావ‌ని, ఇప్ప‌టికైనా ఆ ట్రాప్ నుంచి బ‌య‌ట‌ప‌డి స్వ‌తంత్ర నేత‌గా ఎద‌గాల‌ణ‌ఙ పవన్ కళ్యాణ్ కు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement