Thursday, May 9, 2024

Hyderabad: అక్రమ నీటి కనెక్షన్లపై వాటర్​ బోర్డు ఫోకస్​.. ఆరుగురిపై కేసు నమోదు

హైదరాబాద్​ వాటర్​ బోర్డు పర్మిషన్​ లేకుండానే నల్లా కనెక్షన్​ పెట్టుకుని అక్రమంగా నీటిని వాడుకుంటున్న వారిని అధికారులు గుర్తించారు. చింత్​లోని భగత్​సింగ్​ నగర్​లోని వాటర్​బోర్డు పైపులైన్ల నుంచి నీటి కనెక్షన్లను పెట్టుకున్నారు. అక్రమ నీటి కనెక్షన్లపై వాటర్​ బోర్డు సీరియస్​గా ఫోకస్​ పెడుతోంది. ఈ క్రమంలో జరిపిన తనిఖీల్లో ఆరుగురిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.

అక్రమంగా నీటి కెన్షన్​ తీసుకుని నీటిని వాడుతున్న వారిపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 269, 430, కింద కేసు నమోదు చేశారు. నీటిపారుదల పనులను దెబ్బతీయడం, నీటిని తప్పుగా మళ్లించడం వంటి పనులు చేసిన దానికి వారిపై చర్యలు తీసుకోనున్నట్టు వాటర్​ బోర్డు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement