Sunday, May 5, 2024

పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన జాక్వెలిన్ ..పింకీ ఇరానీ

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాడైజ్ మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌యింది. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్ర‌శేఖర్‌తో స్నేహం, అత‌డి నుంచి ఖ‌రీదైన బ‌హుమ‌తుల‌ను అందుకుంది. ఈ కేసులో త‌మ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఢిల్లీ పోలీసు శాఖ‌కు చెందిన ఆర్థిక నేరాల విభాగం రెండు రోజుల క్రితం జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుల‌కు అనుగుణంగానే జాక్వెలిన్ బుధ‌వారం ఢిల్లీలోని ఎక‌న‌మిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాల‌యానికి చేరుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా జాక్వెలిన్‌కు సంధించాల్సిన ప్ర‌శ్నావ‌ళిని ఇప్ప‌టికే సిద్ధం చేసిన ఢిల్లీ పోలీసులు… ఆమెను రాత్రి 8 గంట‌ల దాకా విచారించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా గురువారం, శుక్ర‌వారం కూడా జాక్వెలిన్‌ను పోలీసులు విచారించ‌నున్నారు. ఈ మేర‌కు ఏర్పాట్లు చేసుకోవాల‌ని పోలీసులు జాక్వెలిన్‌కు సూచించారు. ఈ విచార‌ణ‌కు జాక్వెలిన్‌తో పాటు ఆమెను సుఖేశ్‌కు ప‌రిచ‌యం చేసిన పింకీ ఇరానీ కూడా హాజ‌ర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement