Wednesday, May 1, 2024

17 నుంచి అగ్రి డిప్లమా రెండో విడత కౌన్సెలింగ్‌

హైదరాబాద్, ప్రభన్యూస్ : వ్యవసాయశాస్త్రంలో ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న వివిధ డిప్లమా కోర్సులకు రెండో విడత కౌన్సిలింగ్‌ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు యూని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సుధీర్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత కౌన్సిలింగ్‌లో సీట్ల ఖాళీలను రెండో విడతలో భర్తీ చేస్తామన్నారు.

మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, నిర్నీత ఫీజుతో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement