Friday, May 3, 2024

పంజాగుట్ట మర్డర్ కేసు: తల్లే హంతకురాలు

హైదరాబాద్ లో మిస్టరీగా మారిన పంజాగుట్ట బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో బాలిక తల్లే హంతకురాలని పోలీసులు తేల్చారు. నిందితురాలితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. 

పంజాగుట్టలోని ద్వారకాపురికాలనీలో ఓ షాప్‌ ఎదుట కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో ఒక చిన్నారి మృతదేహం పోలీసులకు లభించింది. అప్పటి నుంచి పోలీసులు ఈ మిస్టరీని ఛేదించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. చివరకు హంతకులను పట్టుకున్నారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో లభించిన కీలకాధారంతో నిందితులను గుర్తించగలిగారు.

ఇది కూడా చదవండి: పంట మార్పిడికి ప్రోత్సాహకాలు ఎక్కడ?: కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement